పూణే కాదు చెన్నై
‘ఆర్ఆర్ఆర్’ టీమ్ రూట్ మార్చారు. షూటింగ్ కోసం నార్త్ వెళ్లాలనుకుని యూ టర్న్ తీసుకొని వెనక్కి వచ్చేశారు. పూణేలో చేయాల్సిన ఓ షెడ్యూల్ను తమిళనాడులో చేయాలనుకుంటున్నారని సమాచారం. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ను పూణేలో చిత్రీకరించాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. అయితే ఇప్పుడు ఆ షెడ్యూల్ను తమిళనాడులో చేద్దామనుకుంటున్నారట.. ఎందుకనే విషయం చిత్రబృందానికే ఎరుక. చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఈ షెడ్యూల్లో పాల్గొంటారు. అయితే ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్పై చిత్రీకరించే సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయని తెలిసింది. అజయ్ దేవగణ్, సముద్రఖని ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరమ్ భీమ్గా, రామ్చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు