నునుపుదనం కోసం
కొందరికి ఏ కాలంలోనైనా ఒళ్లు పగిలిపోవడం, ఎండినట్లు అవ్వడం జరుగుతుంది. ఇంట్లో లభించే సౌందర్యసాధనాలతో కొన్ని జాగ్రత్తలు తీసుకుని చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.
♦ శనగపప్పు 1 కప్పు, బియ్యం 1కప్పు, మినప్పప్పు 1 కప్పు సమపాళ్లలో తీసుకుని, ఛాయపసుపు కొమ్ములు గుప్పెడు, గంధకచూరాలు గుప్పెడు, ఎండబెట్టిన గులాబీ రెక్కలు కొన్ని కలిపి గ్రైండ్ చేసి పొడి చెయ్యాలి. ఈ పొడినికొద్దికొద్దిగా తీసుకుని పెరుగులోకాని, మజ్జిగలో కాని, పాలలో గానికలిపి, సబ్బుకి మారుగా ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి స్నానంచేస్తే ఒళ్లు పేలిపోకుండా ఉండడమే కాకుండా చర్మం నునుపు తేలిసువాసన వెదజల్లుతుంది.
♦ స్నానం చేసే ముందు నువ్వుల నూనె ఒంటికి పట్టించి స్నానం చేస్తే చర్మం పగిలిపోదు.
♦ సబ్బుకి బదులుగా పాలలో పెసరపిండిని కలిపి ఒంటికి పట్టించిస్నానం చేస్తే మంచి ఫలితంఉంటుంది.
♦ స్నానం చేసిన తరువాత మాయిశ్చరైజర్ని గాని బాడీ లోషన్గాని అప్లై చేయడం మరచిపోవద్దు.
♦ పడుకునే ముందు ముఖానికి కోల్డ్క్రీమ్, కాళ్లకీ, చేతులకీ వైట్ పెట్రోలియమ్ జెల్లీ తప్పకుండా అప్లైచేయాలి.
సంబంధిత వార్తలు