డ్రైస్కిన్ కోసం...
♦ పసుపురంగులో ఉండే అరటిపండును మెత్తగా గ్రైండ్ చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు ప్యాక్ వేయాలి. ఇరవై నిమిషాలకు లేదా ఆరిన తర్వాత చన్నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తుంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది. తేనె వాడినందువల్ల చర్మసంబంధ సమస్యలు కూడా రావు.
♦ ఒక టీ స్పూన్ ఓట్స్ పౌడర్, అంతే మోతాదులో బాదం పౌడర్ తీసుకుని అందులో తగినంత తేనె కలిపి పేస్టులా చేసుకుని ముఖానికి, చేతులకు ప్యాక్ వేయాలి. ఆరిన తర్వాత చన్నీటితో ముఖం కడిగితే చర్మం మృదుత్వంతో పాటు నునుపుదనం కూడా సంతరించుకుంటుంది.
♦ ఒక జామకాయ, ఒక టీ స్పూన్ తేనె కలిపి గ్రైండ్ చేసి ప్యాక్ వేసి ఆరిన తర్వాత శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ చర్మంలో తగినంత తేమను, నూనె నిలపడంతోపాటు జామలోని ఔషధ గుణాలు చర్మసంబంధ సమస్యలు తగ్గడానికి దోహదం చేస్తాయి.
♦ కోడిగుడ్డులోని తెల్లసొనను నురగవచ్చే వరకు చిలికి ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ కలిపి మళ్లీ చిలకాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు, మెడకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ చర్మంలో తేమను నిలిపి పొడిబారకుండా చేయడంతోపాటు తెల్లబరుస్తుంది కూడ.
సంబంధిత వార్తలు