తనూజ మృతిపై మహిళా సంఘాల నిరసన
ద్వారకానగర్: తనూజ మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని, విద్యార్థి మృతిపై అనుమానులున్నాయని మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఏ.విమల పేర్కొన్నారు. పెందుర్తిలో ఆదివారం తనూజ దారుణ హత్యకు గురయినందుకు నిరసనగా జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలిక హత్యపై పలు అనుమానాలు వున్నాయని పేర్కొన్నారు. పోస్టుమార్డం రిపోర్టును బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తనూజ హత్యా లేక ఆత్మహత్యా అన్నది తెలపాలని,దిలీప్ అతని మేనమామ విచారణ విషయాలను కూడా ప్రజలకు బహిర్గతం చేయాలన్నారు. ఇంటర్నెట్,మొబైల్ఫోన్లు, టెలివిజన్లలో ఆశ్లీలం ఎక్కువగా చూపించడం వల్లనే బాలికలకు రక్షణ కరువయిందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఎం.ఏ.బేగమ్, జయ, సల్మా, దేవికుమారి, లీల అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.