వైద్యం వికటించి బాలింత మృతి | vydhyam vikatintchi balinta mruti | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించి బాలింత మృతి

Aug 13 2016 11:17 PM | Updated on Sep 4 2017 9:08 AM

మృతురాలు సమీరా

మృతురాలు సమీరా

స్టేషన్‌ రోడ్డులోని లుంబిని ఆస్పత్రికి ప్రసవానికొచ్చిన మహిళ సమీరా(20) మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది.

ఖమ్మం మామిళ్లగూడెం: స్టేషన్‌ రోడ్డులోని లుంబిని ఆస్పత్రికి ప్రసవానికొచ్చిన మహిళ సమీరా(20) మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. సమీరా తల్లి ఆయేషా చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఖమ్మం ప్రకాశ్‌నగర్‌కు చెందిన మార్బుల్‌ల్లో పనిచేసే అక్రం భార్యను శుక్రవారం డెలివరీ కోసం ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలొ శనివారం   డాక్టర్లు ఆపరేషన్‌ చేసి కుట్లు వేశారు. రక్తహీనత ఉండటంతో రక్తం ఎక్కించారు. కాని వైద్యం వికటించి సమీరా మృతి చెందింది.  పాపా క్షేమంగా ఉంది. సమీరా మృతితో బంధువుల రోధన కలిచివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement