రేపే 41 అడుగుల నరకాసుర వధ
-
ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రజలు తరలిరావాలి -
విలేకర్ల సమావేశంలో ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు తాతా బదరీ
ఒంగోలు: నలభై ఒక్క అడుగుల నరకాసుర వధ ను ప్రత్యక్షంగా తిలకించేందుకు పట్టణ ప్రజానీ కం తరలిరావాలని ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షు డు తాతా బదరీ అన్నారు. స్థానిక తాతా లక్ష్మిప్రసాద్ కల్యాణ మండపంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమం స్థానిక పొట్టిశ్రీరాములు విగ్రహం సెంటర్లో నిర్వహిస్తున్నామన్నారు. 29వ తేదీ శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత 4 గంటలకు (అంటే తెల్లవారితే ఆదివారం) ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
దీపావళి పండుగ ప్రాశస్త్యాన్ని ప్రతి ఒక్కరి కళ్లకు కట్టినట్లుగా వివరించేందుకు ఒంగోలు ఫ్రెండ్స్క్లబ్ ఈ కార్యక్రమం చేపడుతుందన్నారు. ఢిల్లీలో రామ్లీలా మైదానంలో నరకాసుర వధ ఎలా అ యితే జరుగుతుంది అదే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. గుర్రం బదరీ, బియ్యపు బదరీ, కోడూరి కిషోర్కుమార్, బియ్యపు విజయ్, తమ్మన ఆంజనేయులు, అన్నెం శ్రీనివాసులు, మాడిశెట్టి రంగనాయకులు, ఏల్చూరి రాఘవ పాల్గొన్నారు.