మచిలీపట్నంలో దొంగల బీభత్సం
కృష్ణా(మచిలీపట్నం): మచిలీపట్నంలోని శుకర్లాబాద్లో దొంగలు బీభత్సం సృష్టించారు. శనివారం సాయంత్రం ఓ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న రామసునీత(45) అనే మహిళను దొంగలుతాళ్లతో కట్టేసి ఇంట్లో ఉన్న బంగారు నగలను, డబ్బును దోచుకున్నారు. రాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి వచ్చిన బంధువులకు సునీత అపస్మారక స్థితిలో ఉండటం గమనించి ఆమెను మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సునీత సృహలోకి వస్తేగానీ అసలేం జరిగిందనేది తెలుస్తుందని పోలీసులు తెలిపారు.