టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య ఘర్షణ


సాక్షి, బిక్కవోలు(తూర్పుగోదావరి జిల్లా): బిక్కవోలు మండలం రంగాపురంలో ఆదివారం టీడీపీ, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వినాయక నిమజ్జనంలో ఈ ఘటన చోటుచేసుకుంది.



వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నక్కా దుర్గయ్య, నక్కా వెంకన్న, గండికోట వీరన్న, నక్కా బాబులపై టీడీపీ వర్గీయులు కత్తులతో దాడి చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top