ఎర్రబెల్లి పోలీస్ కాన్వాయ్ని ఢీకొన్న వాహనం
♦ చెరువు, పొలాల్లోకి దూసుకెళ్లిన వాహనాలు
♦ గాంధీనాయక్కు త్రుటిలో తప్పిన ప్రమాదం
దేవరుప్పుల(పాలకుర్తి) : దేవరుప్పు ల మండలం లోని మాదాపురం చెరువుకట్టపై జరిగిన ప్రమాదంలో రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ దారావత్ మోహన్గాంధీ నాయక్కు తృటిలో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే... సోమవారం మండలంలోని కడవెండిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ముగిశాక మధ్యాహ్నం మాదాపురంకు వెళ్లే క్రమంలో చెరువుకట్టపై పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు పోలీస్ కాన్వాయ్ వాహనాన్ని గాంధీనాయక్ వాహనం ఢీకొట్టింది.
దీంతో చెరువులోకి గాంధీనాయక్ కారు దూసుకెళ్లడంతో పొలాల్లోకి పోలీసుల వాహనం దూసుకెళ్లింది. ఎట్టకేలకు స్వల్పగాయాలతో గాంధీనాయక్తో పాటు పోలీసులకు ప్రమాదం తప్పింది. ముందు వాహనంలో వెళ్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే సంఘటనా స్థలానికి చేరుకొని గాంధీనాయక్ను పరామర్శించి ఓదార్చారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆంజనేయులు కోలుకొండకు తీసుకెళ్లి ఆర్ఎంపీతో ప్రథమ చికిత్స చేయిం చారు. అనంతరం గాంధీనాయక్ను మొండ్రాయికి తీసుకెళ్లారు.