శ్రీ వారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ. లక్ష విరాళం
ద్వారకాతిరుమల : శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు ఒక భక్తుని కుటుంబం శనివారం రూ. 1,00,116ను విరాళంగా అందించారు. విశాఖపట్నానికి చెందిన బుద్ధరాజు ఈశ్వరవర్మ, ప్రభావతి దంపతులు క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆలయ నిత్యాన్నదాన ట్రస్టులో ఈ విరాళాన్ని చెక్కు రూపంలో జమ చేశారు. దాత కుటుంబాన్ని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు అభినందించారు.