వనాలు పెంచితేనే మనుగడ

ఉడిత్యాల పాఠశాలలో మొక్కలు నాటి నీళ్లుపోస్తున్న ప్రభాకర్‌రెడ్డి తదితరులు

– జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి 

బాలానగర్‌ : వనాలను విరివిగా పెంచితేనే మానవాళికి భవిషత్‌లో మనుగడ ఉంటుందని జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని వీరన్నపల్లి శివారులో, ఉడిత్యాల గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యార్థులు మొక్కలు నాటే విధంగా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని చెప్పారు. పర్యావరణ ఆవశ్యకత గురించి వారికి తెలియజేయాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వనాలులేకపోవడం వల్లే వర్షాలు సక్రమంగా కురవడంలేదని అన్నారు. వనాలు ఉన్నచోట వర్షాలు అధికంగా కురుస్తున్నాయని చెప్పారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీన్‌కుమార్, తహసీల్దార్‌ రాంబాయి, ఎస్‌ఐ అశోక్‌కుమార్, సర్పంచ్‌ నిర్మల, నాయకులు రాంగోపాల్, నారాయణ, మల్లేష్, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మన్‌నాయక్‌ పాల్గొన్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top