జైత్రయాత్ర

 people support to ys jagan in praja sankalpa yatra - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర బుధవారం ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి, కొండాపురం మండలాల్లో దిగ్విజయంగా సాగింది. కలిగిరి నుంచి ప్రారంభమైన యాత్ర కృష్ణారెడ్డిపాళెం, కుడుములదిన్నెపాడు, తెల్లపాడు క్రాస్, చిన్న అన్నలూరు, మామిడాళ్లపాళెం మీదుగా జంగాలపల్లి వరకు కొనసాగింది. మండుటెండను లెక్క చేయకుండా చిన్నా, పెద్దా తేడా లేకుండా మహిళలు, రైతులు, నిరుద్యోగులు తదితరులు జననేత వైఎస్‌ జగన్‌ వెంట అడుగులు కలపడంతో పాదయాత్ర జైత్రయాత్రలా సాగింది. తమగోడు వెళ్లబోసుకున్న పలువురికి మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని ధైర్యం చెబుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు కదిలారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top