విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

people sharing their sorrows to ys jagan - Sakshi

పర్చూరు: విద్యాశాఖ నిర్లక్ష్యానికి పెద్దకుమారుడిని పోగొట్టుకున్నానని పైరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వేల్పుల జయమ్మ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద విలపించింది. 10 నెలల క్రితం కరేడు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న తన కుమారుడు శ్రీకాంత్‌ను తమ ప్రేమేయం లేకుండా విహారయాత్రకు తీసుకువెళ్లారని చెప్పింది. తిరుగు ప్రయాణంలో బస్సు బోల్తాపడి విద్యార్థులకు గాయాలయ్యాయని.. తన బిడ్డ 80 రోజులు కోమాలో ఉండి మరణించాడని చెప్పింది. అన్ని విధాల ఆదుకుంటామని చెప్పిన విద్యాశాఖ జిల్లా అధికారి బదిలీపై వెళ్లారని.. ఆ తర్వాత వచ్చిన అధికారి పట్టించుకోవడంలేదని కన్నీటి పర్యంతమైంది. కార్యాలయాల చుట్టూ తిప్పించుకుని ఇబ్బందులు పెడుతున్నారని, ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదని విలపించింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top