వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..
ఉలవపాడు: వృద్ధులైన దివ్యాంగులు.. మూడు చక్రాల బండితో తిప్పలు పడుతున్నారని.. తమలాంటివారికి మోటారుతో నడిచే వాహనాలు అందించాలని లింగంగుంటకు చెందిన ఎనిమిరెడ్డి కొండయ్య జగన్ దృష్టికి తీసుకువచ్చాడు. ఆరోగ్యం సరిగా ఉండడం లేదని, పింఛన్ సరిపోవడం లేదని, ఇల్లు కాలిపోవడంతో పందిరిలో ఉంటున్నానని విలపించాడు. ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదని చెప్పాడు.