అర్జీలిచ్చినా పింఛన్ ఇవ్వడం లేదు
చీరాల అర్బన్: ‘నాకు కిడ్నీలు పనిచేయడంలేదని డాక్టర్లు చెప్పారయ్యా. డయాలసిస్ చేయించుకునే స్థోమత నాకు లేదు. మందులతోనే నెట్టుకొస్తున్నా. కూలి పనులు చేసుకునే తనకు మందులు కొనుగోలు చేయడమే కష్టంగా ఉంది’ అంటూ చౌటపాలెం ఎస్సీకాలనీకి చెందిన చుండి కోటయ్య వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలిపాడు.
అర్జీలిచ్చినా పింఛన్ ఇవ్వడం లేదు
చీరాల అర్బన్: ‘నా భర్త చనిపోయి 13 సంవత్సరాలు అయింది. వితంతు పింఛన్ కోసం దరఖాస్తులందించినా ఇప్పటి వరకు మంజూరు కాలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నాననే నెపంతో పింఛన్ రాకుండా ఆపివేస్తున్నారు’ అని చెంచుపాలెంకు చెందిన అన్నెం కొండమ్మ వైఎస్ జగన్మోహన్రెడ్డితో చెప్పింది.
ఆపరేషన్ చేసినా కాలు బాగుపడలేదు..
చీరాల అర్బన్: ‘కూలి పని చేస్తూ జారిపడడంతో కాలు విరిగింది. ఆరు నెలల క్రితం ఆపరేషన్ చేయించాను. అయినా కాలు బాగపడలేదు. కాలు సహకరించకపోవడంతో పనులకు వెళ్లడం లేదు. కూలి డబ్బులు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది’ అంటూ లింగంగుంట ఎస్సీకాలనీకి చెందిన జి.ఏసు వైఎస్.జగన్మోహన్రెడ్డికి విన్నవించాడు.