ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

people sharing their sorrows to ys jagan - Sakshi

కందుకూరురూరల్‌: ‘ఫ్లోరైడ్‌  నీరు తాగడంతో కిడ్నీ రోగాలు వస్తున్నాయి. ఎంతో మంది చనిపోతున్నారు. కొన్నేళ్లుగా ఫ్లోరైడ్‌ నీటిని తాగలేక ఇబ్బందులు పడుతున్నాం. జననేతకు సమస్యను విన్నవించేందుకు వచ్చా’ అంటూ తిమ్మపాలెం గ్రామానికి చెందిన అల్లూరి సుబ్బలక్ష్మి చెప్పింది.

చంద్రబాబు మోసం చేశాడు
పొన్నలూరు: వ్యవసాయ రుణాలు మాఫీ చేయకుండా చంద్రబాబు మోసం చేశాడని లింగంగుంట గ్రామానికి చెందిన గోచిపాతల రాణమ్మ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. ఎకరా పొలానికి రూ. 40 వేలు క్రాప్‌లోను తీసుకున్నానని, రుణం మాఫీ కాకపోవడంతో చాలాసార్లు అధికారులకు అర్జీలు ఇచ్చినా మేలు జరగలేదని మొరపెట్టుకుంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top