మా భూములు మాకు దక్కేలా చేయండి సార్
ఒంగోలు వన్ టౌన్: వెంకటాద్రిపాలెం, బడేవారిపాలెం, కొల్లగుంట, ఎండ్లూరిపాడు గ్రామాలకు చెందిన గామస్తులు గత 200 సంవత్సరాలుగా సాగుచేస్తున్న 990 ఎకరాల భూములను సాగుదార్లకు దక్కకుండా కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆయా గ్రామాల రైతులు ప్రజాసంకల్పయాత్రలో జగన్కు తెలిపారు. 1966లో నాటి అటవీశాఖ మంత్రి చెంచు రామనాయుడు అప్పటి రైతుల అభ్యర్థనమేరకు వ్యవసాయం కోసం విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశారని తెలిపారు. గత 60 సంవత్సరాలుగా రైతులంతా పట్టాల కోసం పోరాడుతున్నామన్నారు. మద్దతుగా నిలిచి రైతులకు భూములు దక్కేలా చూడాలని రావూరి వెంకటేశ్వర్లు, మేకల వెంకటేశ్వర్లు, మాలకొండయ్య, జిల్లేలమూడి మాధవరావు, రావు శ్రీను తదితరులు కోరారు.
వెంకటాద్రిపాలెం రైతులు