టీడీపీ కండువా వేసుకుంటేనే రుణాలు..
పర్చూరు: టీడీపీ కండువా వేసుకుంటేనే బీసీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేస్తామని లేకపోతే అడ్డుకుంటామంటున్నారని సింగరాయకొండలోని బాలరెడ్డి నగర్కు చెందిన షేక్ సుల్లాన్బీ, ఎస్కే ఖాదర, ఇ.మారతమ్మ, సావిత్రి, కృష్ణవేణి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద వాపోయారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మాత్రమే తమకు ఇళ్లు మంజూరు చేశారని, మూడున్నరేళ్ల నుంచి ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని విలపించారు.