మా గ్రామంలో సమస్యలు తీర్చండయ్యా!

people sharing their sorrows to ys jagan - Sakshi

ఉలవపాడు: తమ గ్రామంలోని సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని విప్పగుంటకు చెందిన మహిళలు, విద్యార్థులు జగన్‌కు వినతిపత్రం అందజేయడానికి ప్రజాసంకల్పయాత్రకు వచ్చారు. పొన్నలూరు మండలం విప్పగుంట గ్రామానికి చెందిన పద్మావతి, మాల్యాద్రి, మహేశ్వరితో పాటు పది మంది తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో నీటి సమస్య ఉందని.. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని.. మురుగు కాలువలు లేవని చెరప్పారు. వృద్ధులకు పింఛన్లు కూడా సక్రమంగా రావడం లేదని విన్నవించుకున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top