ఉద్యోగ భద్రత కల్పించండి
‘సక్రమంగా జీతం ఇవ్వడం లేదు. కుటుంబాలను పోషించుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాం. ఉద్యోగ భద్రత కూడా లేద’ని 108 ఉద్యోగులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. తమ సమస్యలను తీర్చాలని జగన్ను వేడుకున్నారు. రాష్ట్రంలో 2 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, విడతల వారీగా వాహనాలను తగ్గించి, తమను తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జననేత దృష్టికి తీసుకెళ్లారు.