కూలి గిట్టడం లేదన్నా!
నెల్లూరు(సెంట్రల్) : ‘అన్నా.. మేము శనగపంట పొలంలో రోజు వారి పనికి వెళుతున్నాం.. మాకు రోజుకు రూ.150 కూలి ఇస్తున్నారు.. దీంతో ఇంట్లో పూటగడవడం కష్టంగా ఉందన్నా‘ అంటూ కృష్ణారెడ్డిపాళేనికి చెందిన పలువురు మహిళా కూలీలు బుధవారం వైఎస్ జగన్మోహన్రెడ్డికి గోడువెళ్లబోసుకున్నారు. పంట వేసిన వారికి కూడా గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. పంటలు సరిగా పండక పోవడంతో కూలి పనులు కూడా దొరకడం కష్టంగా మారిందని విన్నవించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సాయం అందడం లేదని తెలిపారు. స్పందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మన ప్రభుత్వం వస్తే మీ లాంటి వారికి న్యాయం చేస్తామని వారికి ధైర్యం చెప్పారు.