ప్రధాని షెడ్యూల్లో 10 నిమిషాలే విశ్రాంతి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. గురువారం ఉదయం 11:45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవడంతో మొదలుకానున్న ఆయన పర్యటన.. సాయంత్రం 6:15 నిమిషాలకు తిరుపతి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగుప్రయాణంతో ముగుస్తుంది. తెలుగు గడ్డపై మోదీ గడపనున్న ఆరున్నర గంటల్లో కేవలం 10 నిమిషాలు మాత్రమే విశ్రాంతి తీసుకోనుండటం గమనార్హం. అదికూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేముందు స్నానం గట్రా చేసేందుకు మాత్రమే. రేపు ఏపీలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ఇలా కొనసాగనుంది..
ఉదయం 11:45 గంటలు: గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
మధ్యాహ్నం 12:30 కు: అమరావతి శంకుస్థాపన ప్రాంతానికి చేరుకుంటారు.
12:30 నుంచి 12:35: అమరావతి గ్యాలరీ సందర్శన
12:35 నుంచి 12:43: పూజాతి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
12:43 నుంచి 12:45: ప్రధాన వేదికపైకి మోదీ రాక
12:45 నుంచి 12:48: ప్రధాని, ఇతర ముఖ్య అతిథులకు పుష్పగుచ్ఛాల అందజేత
12:48 నుంచి 12:50: 'మా తెలుగు తల్లికి' గీతాలాపన
12:50 నుంచి 12:-53: జపాన్ మంత్రి యెసుకే తకాగి ప్రసంగం
12:53 నుంచి 12:56: సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రసంగం
12:56 నుంచి 1:01: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగం
1:01 నుంచి 1:11: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రసంగం
1:11 నుంచి 1:43: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం
1:43 నుంచి 1:46: ప్రధాని, ఇతర ముఖ్యులందరికి జ్ఞాపికల అందజేత
అనంతరం ప్రధాని మోదీ తిరుపతి ప్రయాణమవుతారు. ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను అనుసరిస్తారు.
మధాహ్నం 3:30 గంటలకు మోదీ తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
3:31 నుంచి 3:34: ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లోఫొటో గ్యాలరీ సందర్శన
3:43 నుంచి 3:45: ఎయిర్ పోర్ట్ కొత్త టెర్మినల్ ప్రారంభోత్సవం
3:45 నుంచి 3:46: ప్రధాని మోదీకి జ్ఞాపిక అందజేత
3:50 గంటలకు శ్రీసిటీకి ప్రయాణం
సాయంత్రం 4 గంటలకు మొబైల్ కంపెనీల కార్యక్షేత్రాలకు శంకుస్థాపాన
4:15 గంటలకు తిరుమల బయలుదేరనున్న ప్రధాని
5:00 గంటలకు కొండపైనున్న పద్మావతి అతిథిగృహానికి చేరుకోనున్న మోదీ
5:00 నుంచి 5:10: విశ్రాంతి
5:15 నుంచి 6 గంటల వరకు: శ్రీవారి దర్శనం
6:15 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్ట్ కు చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం