లోలెవల్ కాజ్‌వేలో పడి వ్యక్తి గల్లంతు


హత్నూరు(మెదక్): మెదక్ జిల్లా హత్నూరు మండలం రెడ్డి ఖానాపూర్ సమీపంలోని లోలెవల్ కాజ్‌వేపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. నర్సాపూర్ మండలం జక్కపల్లికి చెందిన ఆంజనేయులు ఈ రోజు ఉదయం లోలెవల్ కాజ్‌వే దాటుతూ ప్రమాదవశాత్తు అందులో జారిపడి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top