శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్‌ చలమేశ్వర్‌

జస్టిస్‌ చలమేశ్వర్‌కు లడ్డూ ప్రసాదాలు అందజేస్తున్న జేఈవో శ్రీనివాసరాజు


– జస్టిస్‌ నూతి రామ్మోహన్‌రావు కూడా

సాక్షి, తిరుమల: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జె.చలమేశ్వర్‌ తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నూతి రామ్మోహన్‌రావు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం వారు వేర్వేరుగా ఆలయానికి వచ్చారు.  ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత శ్రీవారిని, ఆ తర్వాత వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top