మూడు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు

మూడు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు - Sakshi

పాలకొల్లు అర్బన్‌: పాలకొల్లు మండలం లోని సగంచెరువు, లంకలకోడేరు, దగ్గులూరులో బుధవా రం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. సగంచెరు వు వద్ద ఎదురెదురుగా వస్తున్న మోటార్‌ సైకిళ్లు ఢీకొనడంతో దిద్దే నాగేశ్వరరావు అనే వ్యక్తికి గాయలయ్యాయి. పాలకొల్లు నుంచి నరసాపురం వైపు యాక్టివా వాహ నంపై వెళుతున్న మేడిది దుర్గాప్రసాద్‌ నాగేశ్వరరావుని ఢీకొని పరారయ్యా డు. బాధితుడు తెలి పిన మోటార్‌సైకిల్‌ నంబర్‌ ఆధారంగా దుర్గాప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అలాగే లంకలకోడేరు వద్ద పాలకొల్లు వైపు నుంచి మోటార్‌సైకిల్‌పై వస్తున్న వ్యక్తిని భీమవరం వైపు వెళుతున్న కారు ఢీకొట్టింది. దీంతో గాయాలైన బైక్‌ చోదకుడిని స్థానికులు భీమవరం ఆస్పత్రికి తరలించారు. అలాగే దగ్గులూరు వద్ద ఎదురుగా వస్తున్న గేదెను తప్పించబోయి కారు కల్వర్టును ఢీకొట్టి పంట బోదెలోకి దూసుకుపోయింది. ఈ రెండు ప్రమాదాలపై పోలీసులు కేసులు నమోదు చేయలేదు.


 


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top