పీహెచ్‌సీల్లోనూ జనన ధ్రువీకరణ పత్రాలు

పీహెచ్‌సీల్లోనూ జనన ధ్రువీకరణ పత్రాలు

చేబ్రోలు (ఉంగుటూరు) : ప్రభుత్వాసుపత్రులు, పీహెచ్‌సీల్లో పుట్టిన పిల్లలకు అక్కడికక్కడే జనన ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ డి.కృష్ణమోహన్‌ అన్నారు. శనివారం ఉంగుటూరు మండలంలో చేబ్రోలు పీహెచ్‌సీ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో ప్రసవించిన బిడ్డ తల్లిదండ్రులు చింతన శివనందిని, కిషోర్‌ దంపతులకు జనన ధ్రువీకరణ పత్రాన్ని ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు వ్యాధినిరోధక టీకాలు వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ జె.శ్రీనివాస్, సీహెచ్‌వో ఎం.విజయకుమారి, ఆరోగ్య విస్తణాధికారి వై.లక్ష్మణరావు, ఫార్మాసిస్ట్‌  కేవీ.సత్యనారాయణ పాల్గొన్నారు. 


 


 


 


 


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top