గాండ్ల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు


గాండ్ల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

 

 

అనంతపురం న్యూటౌన్‌ : విద్యతోనే సామాజిక గౌరవం లభిస్తుందని ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య అన్నారు.  అఖిల గాండ్ల యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక శ్రీనివాస నగర్‌లోని బాలాజీ కల్యాణమండపంలో గాండ్ల కులానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించారు. ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్యతో పాటు కడప మేయర్‌ సురేష్‌బాబు, సంఘం జిల్లా అధ్యక్షుడు సుభాష్‌చంద్రబోస్‌ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఆత్మవిశ్వాసం పెంచుకుని ఉన్నత స్థానాలలో నిలవాలని సూచించారు.  అనంతరం  2015–16 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో  ప్రతిభ కనపరిచిన 17 మందికి, ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనపరచిన 10 మందికి జ్ఞాపికలను, నగదు బహుమతులను అందించారు. కార్యక్రమంలో సంఘం యువజన విభాగం అధ్యక్షులు రమేష్, భాస్కర్, జడ్పీటీసీ విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు.  
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top