వ్యవసాయానికి పెద్దపీట

వ్యవసాయానికి పెద్దపీట


అనంతపురం అగ్రికల్చర్‌ : వ్యవసాయ, అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తామని స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రీజినల్‌ మేనేజర్‌ (ఆర్‌ఎం) వి.శివకుమార్‌ తెలిపారు. గురువారం ఆయన ప్రస్తుత ఆర్‌ఎం ఎంవీఆర్‌ మురళీకృష్ణ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. మురళీకృష్ణ హైదరాబాద్‌కు బదిలీ కాగా హైదరాబాద్‌ నుంచి శివకుమార్‌ జిల్లాకు బదిలీపై వచ్చారు. ఈ క్రమంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోవ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మే మొదటి వారం నుంచి పంట రుణాల రెన్యువల్స్, కొత్త రుణాల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. సమయం చాలా ఉందని రైతులు ఆలస్యం చేయకుండా సాధ్యమైనంత తొందరగా రెన్యువల్‌ చేయించుకుంటే మేలన్నారు. 



ఈనెల 24వ తేదీ నుంచి ఎస్‌బీఐ కింద పని చేస్తున్నాయని తెలిపారు. తమకు సంబంధించి అనంతపురం అర్బన్‌ రీజియన్‌ పరిధిలో 42 శాఖలు ఉండగా రూ.5 వేల కోట్ల వ్యాపారలాదేవీలు జరుగుతున్నాయన్నారు. అలాగే అనంతపురం రూరల్‌ రీజియన్‌ కింద 45 శాఖలు ఉండగా వాటి పరిధిలో రూ.3,700 కోట్లు మేర టర్నోవర్‌ ఉందన్నారు. ఇప్పటివరకు తిరుపతి కేంద్రంగా పని చేస్తుండగా ప్రస్తుతం పరిపాలనా విభాగం కర్నూలు కేంద్రానికి మార్పు చేశారన్నారు. గతంలో అనంతపురం జిల్లాలో పని చేసిన అనుభవం ఉన్నందున ఎస్‌బీఐ ద్వారా జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. నూనత ఆర్‌ఎం శివకుమార్‌కు చీఫ్‌ మేనేజర్లు హరిబాబు, డిప్యూటీ మేనేజర్‌ ఎస్‌వీ ప్రసాద్, ఇతర అధికారులు, సిబ్బంది పుష్ఫగుచ్చాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బదిలీపై వెళ్తున్న ఆర్‌ఎం మురళీకృష్ణను సన్మానించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top