రేపు చలోప్రొద్దుటూరు

కరపత్రాలు ప్రదర్శిస్తున్న ఆర్‌వీఎస్‌ కార్యకర్తలు

పలమనేరు: ఈ నెల ఆరో తేదీ చలో వైఎస్‌ఆర్‌ జిల్లా చలో ప్రొద్దుటూరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాయలసీమ విద్యార్థి సంఘం (ఆర్‌వీఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు నగరం బాలాజీ తెలిపారు. స్థానిక డిగ్రీ కళాశాల వద్ద గురువారం సంఘం సభ్యులతో కలిసి పోస్టర్లను విడుదల చేశారు. ఆరో తేదీ నుంచి రెండు రోజుల పాటు ప్రొద్దుటూరులో రాయలసీమ చరిత్ర, వారసత్వం,నీటి వనరులు, రైతాంగ సమస్యలు, యువతకు ఉపాధి తదితర సమస్యలపై చర్చించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు అశోక్,నియోజకవర్గ నేతలు రామచంద్ర, పరమేష్, పవన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top