బీఎస్ఎన్ఎల్ కస్టమర్ మీట్ నేడు
డాబాగార్డెన్స్: బీఎస్ఎన్ఎల్ కస్టమర్ మీట్ను ఈ నెల 25న నిర్వహించనున్నట్టు టెలికాం జిల్లా జనరల్ మేనేజర్(పీఆర్) తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించనున్న కస్టమర్ మీట్లో వినియోగదారులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆరిలోవ, సాగర్నగర్,గీతం,కిర్లంపూడి, లలితానగర్, ఎంవీపీ కాలనీ, మధురవాడ, నరసింహనగర్, పాండురంగాపురం, సీతమ్మధార ప్రాంతాల వినియోగదారులు డివిజనల్ ఇంజనీర్(నార్త్), న్యూ టెలిఫోన్ ఎక్సే్ఛంజ్ బిల్డింగ్, ఎల్ఐసీ అపార్టుమెంట్స్, సీతమ్మధార వద్ద నిర్వహించనున్న కస్టమర్మీట్లో పాల్గొనాలని సూచించారు.