వైభవం.. భావన రుషీశ్వరస్వామి కల్యాణం
తాడిపత్రి టౌన్ : స్థానిక సీబీరోడ్డులోని మార్కేండేయ స్వామి ఆలయంలో భావన రుషీశ్వరస్వామి కల్యాణం గురువారం వైభవంగా జరిగింది. భావన రుషీశ్వరస్వామి మహోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లు ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా ఆలంకరించి, కల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం సాయంత్రం స్వామి ఉత్సవాలను పురవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన ఆర్చకుడు జానకీరామశర్మ , ఆలయ కమిటీ సభ్యులు, సభ్యులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు