కారు, ఆటో ఢీ
- తొమ్మిది మందికి గాయాలు
- కర్నూలు ఆసుపత్రికి తరలింపు
పెద్దపాడు (గూడూరు రూరల్): కె.నాగలాపురం పోలీసుస్టేషన్ పరిధిలోని పెద్దపాడు సమీపంలో శనివారం కారు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. ప్యాలకుర్తికి చెందిన ఎనిమిది మంది కూలీలు రోజూ పంచలింగాలలోని ఇటుకల తయారీ కేంద్రంలో పని చేసేందుకు వెళ్తున్నారు. రోజు మాదిరిగానే పని ముగించుకుని సాయంత్రం స్వగ్రామానికి ఆటోలో తిరుగు పయనమయ్యారు. పెద్దపాడు గ్రామ దాటిన తరువాత కోడుమూరు వైపు నుంచి వస్తున్న కారు వేగంగా ఆటోను ఢీకొంది. దీంతో ఆటో పొలాల్లోకి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న దస్తగిరి, డ్రైవర్ రమేష్తో పాటు ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్తో పాటు అందులో ప్రయాణిస్తున్న వారు పరారయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఏఎస్ఐ ఓబులేసు తెలిపారు.