కువైట్లో వైఎస్ జగన్ అభిమానుల సంబరాలు

కువైట్లో వైఎస్ జగన్ అభిమానుల సంబరాలు - Sakshi


తమ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్రెడ్డికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజురు చేయడంపట్ల కువైట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటీ సభ్యులు హార్షం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ రాకతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. జన నేత బెయిల్ పై విడుదలైన సందర్భంగా ప్రతి రోజు ఒక పండుగలా ఉందని వారు పేర్కొన్నారు. స్నేహితులు, బంధువులకు విందు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకుంటున్నట్లు వారు వివరించారు.


 


గురువారం కువైట్లో ఇచ్చిన భారీ విందుకు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారని తెలిపారు.అలాగే జగన్ విడుదలైన నాటి నుంచి ప్రతి రోజు ఓ పండగలా ఉందని వారు పేర్కొన్నారు. తమ సంతోషాన్ని కువైట్లోని ఫర్వనియ,ఖైతాన్ సాల్మియ, హవెల్లి తదితర ప్రాంతాలలోని తెలుగువారి హోటళ్లలో ప్రతిరోజు ఒకరు ఉచితంగా భోజనం చేసే అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసే వరకు తాము ఆహార్నిశలు శ్రమిస్తామన్నారు.


 


కువైట్లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటి సభ్యులు యం.వి. నరసా రెడ్డి, తెట్టు రఫీ, గోవింద్ నాగరాజ్, లాలితరాజ్, షేక్ హుస్సేన్లతోపాటు యం. బాలిరెడ్డి, పి. శ్రీనివాసుల రెడ్డి, యన్. మహేష్ రెడ్డి , ఆకుల ప్రభాకర్, కడప శీను, కె. సురేంద్ర రెడ్డి, పి. రెహమాన్ ఖాన్, వి.పి. రామచంద్ర రెడ్డి, సి. చంద్రశేఖర్ రెడ్డి  యం, చంద్ర శేఖర్ రెడ్డి, నాగి రెడ్డి చంద్ర, పి. సురేష్ బాబు, కే. వాసు దేవ రెడ్డి, ప్రకాష్, లాజరస్, అజీస్, న్యాజ్, యం. కల్యాణ్, షేక్ మహబూబ్ బాష, షేక్ ఖాదర్, షేక్ మున్నా, మరియు వై. యస్.ఆర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top