యువతి అదృశ్యం
చిక్కడపల్లి: షాపింగ్కు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు సోమవారం చేసుకుంది. బాగ్లింగంపల్లి సెక్టర్ ఎస్ఐ వేముల కిషోర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాగ్లింగంపల్లికి చెందిన షాలిని(26) ఈ నెల 11న మధ్యాహ్నం షాపింగ్కు వెళ్తున్నట్లు చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. యువతి సోదరుడు వినోద్ చారి ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.