కొత్త పనిమనిషి పనే
వజ్రాభరణాల దొంగ రిమాండ్
బంజారాహిల్స్: శ్రీనగర్ కాలనీలోని చల్లా డోయెన్ అపార్ట్మెంట్స్లో నివసించే డాక్టర్ పద్మ వీరపాని ఇంట్లో రూ.3 లక్షల విలువైన వజ్రాభరణాలు దొంగిలించిన కేసులో నిందితురాలిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. డాక్టర్ పద్మ వీరపాని ఈ నెల 27న ఉదయం ఓ శుభకార్యానికి వెళ్లే క్రమంలో జ్యువెల్లరీ బాక్స్లో చూడగా అందులో ఉన్న వజ్రాల గాజులు కనిపించకపోవడంతో చోరీకి గురైనట్లు భావించి అదే రోజు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అనుమానితులను విచారించారు. నాలుగు వారాల క్రితమే ఆమె ఇంట్లో పనికి కుదిరిన బాలానగర్ మూసాపేట్కు చెందిన రాపంతు ఆండాలు అలియాస్ సుధ(35) చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఆభరణాలను స్వాధీనం చేసుకొని నిందితురాలిని బుధవారం రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్ క్రైం ఎస్ఐ భరత్భూషణ్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.