ప్రియుడితో వివాహిత.. అత్యాచారం చేసిన బంధువులు
అహ్మదాబాద్ : ప్రియుడితో పారిపోవడానికి ప్రయత్నించిందంటూ ఓ వివాహితపై భర్త తరుపు బంధువులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా సెల్ఫోన్లో చిత్రికరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. గుజరాత్, అహ్మదాబాద్ సమీపంలోని నానీ కరాజ్ గ్రామానికి చెందిన చెందిన ఓ వివాహిత అదే గ్రామంలో ఉంటున్న యువకుడితో ప్రేమలో పడింది. దీంతో భర్త, పిల్లలను వదిలి అతనితో ఊరు వదిలి పారిపోయేందుకు యత్నించింది.
విషయం తెలుసుకున్న భర్త తరుఫు బంధువులు ఆ ఇద్దరిపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టి, ఆమె జుట్టును కత్తిరించారు. అయినా కోపం చల్లారక.. ఏడుగురు బంధువులు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను ఫోనులో రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది బాగా వైరల్ అయ్యింది. ఈ వ్యవహారం పోలీసులకు చేరడంతో.. అత్యాచారానికి పాల్పడిన మానిబెన్ బాబోర్, రాకేశ్ బాబోర్, రాజేశ్ బాబోర్, భరత్ మావి, నర్సింగ్ మావి, దినేశ్ పర్మార్, శైలేష్ బరియాలను అరెస్ట్ చేశారు.