నవ వధువు అనుమానాస్పద మృతి
సాక్షి, సూర్యాపేట: జిల్లా కేంద్రంలో ఓ నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కిరణ్కు ఆరు నెలల క్రితం భవానితో వివాహమైంది. కాగా ఆదివారం రాత్రి భవాని అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఎస్పీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కిరణ్ తమ కూతురిని వేధింపులకు గురిచేస్తున్నాడని.. అతనే హత్య చేసి ఆత్మహత్యాలా చిత్రించేందుకు యత్నిస్తున్నాడంటూ మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.