గ్యాస్‌ కనెక్షన్‌ ఇప్పిస్తామని..

 Woman Drugged And Gangraped In Rajasthan - Sakshi

జైపూర్‌ : రాజస్తాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో పాతికేళ్ల యువతికి మత్తుమందు ఇచ్చి సామూహిక లైంగిక దాడికి తెగబడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఏడాది మార్చిలో బాధిత మహిళ గ్యాస్‌ కనెక్షన్‌ దరఖాస్తును ఇచ్చేందుకు ఓ కియోస్క్‌కు వెళ్లారు. కొద్దిరోజుల అనంతరం నిందితుడు ఆమెను గ్యాస్‌ కనెక్షన్‌ ఇప్పించేందుకు సహకరిస్తానని చెప్పి కుచమాన్‌ నగరానికి తీసుకువెళ్లి మత్తుమందు కలిపిన పానీయాన్ని ఇచ్చి మరొకరితో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు.

కాగా, వారు ఈ ఘోరాన్ని వీడియోలో రికార్డు చేశారు. యువతి ఫిర్యాదుతో నిందితులు ముఖేష్‌, కిషోర్‌లపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలో వారిని అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ సురేష్‌ కుమార్‌ సన్వరియా తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top