గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తామని..
జైపూర్ : రాజస్తాన్లోని నాగౌర్ జిల్లాలో పాతికేళ్ల యువతికి మత్తుమందు ఇచ్చి సామూహిక లైంగిక దాడికి తెగబడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఏడాది మార్చిలో బాధిత మహిళ గ్యాస్ కనెక్షన్ దరఖాస్తును ఇచ్చేందుకు ఓ కియోస్క్కు వెళ్లారు. కొద్దిరోజుల అనంతరం నిందితుడు ఆమెను గ్యాస్ కనెక్షన్ ఇప్పించేందుకు సహకరిస్తానని చెప్పి కుచమాన్ నగరానికి తీసుకువెళ్లి మత్తుమందు కలిపిన పానీయాన్ని ఇచ్చి మరొకరితో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు.
కాగా, వారు ఈ ఘోరాన్ని వీడియోలో రికార్డు చేశారు. యువతి ఫిర్యాదుతో నిందితులు ముఖేష్, కిషోర్లపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలో వారిని అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ సురేష్ కుమార్ సన్వరియా తెలిపారు.