భర్త మర్మాంగాన్ని కోసేసిన భార్య

Wife Cut Private Part Of Her Husband Due To Extra Marital affairs In Odisha - Sakshi

భర్తకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం

ఒడిశాలో ఘటన

జయపురం: వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో భర్త మర్మాంగాన్ని భార్య కోసేసిన ఘటన ఒడిశాలోని నవరంగపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన యువకుడు కోరాపుట్‌ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతు న్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నవరంగపూర్‌ జిల్లా తెంతులికుంటి సమితిలోని ఉదయపూర్‌ గ్రామానికి చెందిన ఓ యువకుడికి మూడేళ్ల కిందట వివాహం జరిగింది.

స్థానికంగా పనులు లేకపోవడంతో అతను వేరే రాష్ట్రంలో ఇటుకబట్టీ కూలీగా వలస వెళ్లాడు.కొన్ని నెలల క్రితం గ్రామానికి తిరిగి వచ్చిన యువకుడు ఏపనీ చేయకుండా ఇంటివ ద్దనే ఉంటున్నాడు. పనికి వెళ్లకుండా నెలల తరబడి భర్త ఇంటి వద్దే ఉండటంతో భార్యకు అనుమానం మొదలైంది. భర్తకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో రోజూ అతడితో గొడవకు దిగేది. దీంతో ఇరువురి మధ్య రోజు గొడవలు జరుగుతూవుండేవి. ఇక భర్తపై తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య ఎలాగైనా అతనిపై పగ తీర్చుకోవాలని నిశ్చయించుకుని సమయం కోసం ఎదురు చూసింది.

గత ఆదివారం ఆమెకు అవకాశం లభిం చింది. భర్త గాఢ నిద్రలో ఉన్న సమయంలో అతని కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో అతడి మర్మాంగాన్ని కోసేసింది. దాదాపు 90 శాతం మర్మాంగం తెగిపోవడంతో అతని ఆక్రందనలు విన్న చుట్టుపక్కల వారు వచ్చి  స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కోరాపుట్‌ సహిద్‌ లక్ష్మణ్‌ నాయక్‌ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు తెంతులికుంటి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top