కుటుంబసభ్యులే కిడ్నాప్‌ చేశారు..

Wife Complaint on Husband Kidnap Case hyderabad - Sakshi

భర్త అదృశ్యంపై పోలీసులకు భార్య ఫిర్యాదు

కేపీహెచ్‌బీకాలనీ: తన భర్తను కుటుంబ సభ్యులే కిడ్నాప్‌ చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌కు చెందిన విద్యాసాగర్, కరిష్మా దంపతులకు 2016లో వివాహం జరగ్గా ఏడాది క్రితం వీరు  విడిపోయారు. అనంతరం విద్యాసాగర్‌ పెదనాన్న కుమారుడు మౌర్య కరిష్మాను వివా హం చేసుకున్నాడు. ఉద్యోగాన్వేషనలో భాగంగా కేపీహేచ్‌బీ కాలనీలోని హాస్టల్‌లో ఉంటున్న మౌర్యను అతని తండ్రి బాపిరెడ్డి ఇతర కుటుంబసభ్యులు కిడ్నాప్‌ చేసి ఎక్కడో దాచారనికరిష్మా కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనభర్తను తనకు అప్పగించాలని కోరింది. కేసున మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

కారు బీభత్సం : ఇద్దరికి గాయాలు
కేపీహెచ్‌బీకాలనీ:నిజాంపేట రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజాంపేట రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం నాగేంద్రమ్మ, శౌరిరెడ్డి అనే వ్యక్తులు నడుచుకుంటూ వెళుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. కారు డ్రైవర్‌ కారును అక్కడే వదిలి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు కారును పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాగా కారును ఓ మహిళ నడిపినట్లుగా స్థానికులు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top