నెల్లూరు జిల్లాలో దారుణం

 Wife and His Lover Burnt Alive in Nellore District - Sakshi

సాక్షి, నెల్లూరు : భార్య తనను మోసం చేసి.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం ఆ వ్యక్తి సహించలేకపోయాడు. భార్య, ప్రియుడు తన గుడిసెలో ఉన్న సమయంలో ఆ విషయాన్ని పసిగట్టి.. కిరాతకానికి ఒడిగట్టాడు. తన భార్య, ఆమె ప్రియుడి ఇంట్లో ఉన్న సమయంలో బయటినుంచి గొళ్లెం పెట్టి.. విచక్షణారహితంగా పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కోళ్లమిట్టలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మహిళ, ఆమె ప్రియుడు ఇద్దరు సజీవ దహనమైపోయారు. వారు మృతదేహాలు గుర్తుపట్టరానంతగా దహనమయ్యాయి. 

పోలీసుల వివరాల ప్రకారం కోళ్లమిట్టకు చెందిన హరిబాబుకు కవితకు ఐదేళ్ల కిందట పెళ్లయింది. కవితకు మరో వ్యక్తితో వివాహేతరం సబంధం ఉంది. ఈ వివాహేతరం సంబంధం గురించి గతంలోనే తెలుసుకున్న హరిబాబు భార్యను మందలించాడు. ఈ విషయంలో గొడవలు జరిగాయి. గ్రామంలో కూడా ఈ విషయమై పంచాయతీ జరిగిటన్టు తెలుస్తోంది. అయినా, భార్య కవిత ధోరణిలో మార్పురాలేదు. ప్రియుడితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయాన్ని హరిబాబు గమనించాడు. ఈ క్రమంలో హరిబాబు బుధవారం బయటకు వెళ్లిన సమయంలో అతని ఇంటికి కవిత ప్రియుడు వచ్చాడు. కవిత, ఆమె ప్రియుడి ఇంట్లో ఉన్న సమయంలో హరిబాబు ఈ విషయం తెలిసిందే. వెంటనే ఇం‍టికి చేరుకున్న అతను..  ఇద్దరు లోపల ఉన్న విషయాన్ని గుర్తించి బయట నుంచి గొళ్లెం పెట్టాడు. ఈ క్రమంలో పట్టరాని ఆగ్రహంతో కిరాతకుడిగా మారిన హరిబాబు పెట్రోలో పోసి గుడిసెకు నిప్పటించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అతను సంఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. విషయం తెలియడంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. వివాహేతర సంబంధమే ఇంతటి ఘోరానికి కారణమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top