మామ చేతిలో అల్లుడు హతం

Uncle Killed Son in law in Hyderabad - Sakshi

జగద్గిరిగుట్ట: వ్యాపార లావాదేవీల్లో చోటు చేసుకున్న విబేధాల కారణంగా అల్లుడిని మామ హత్య చేసిన సంఘటన బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అమీన్‌పూర్‌ శ్రీవాణి నగర్‌లో ఉంటున్న  జాకీర్‌ హుస్సేన్‌ (48) మియాపూర్‌ నుంచి బాచుపల్లికి వెళ్లే దారిలో సింఘాల్‌ టైల్స్‌ అండ్‌ మార్బుల్స్‌ సమీనంలో ఫంక్చర్‌ దుకాణం నిర్వహిస్తూ సెకండ్‌ హ్యాండ్‌ టైల్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. అతడి మేనమామ ఎండి సుభానీ కూడా సెకండ్‌ హ్యాండ్‌ టైల్స్‌ వ్యాపారం చేసేవాడు. ఈ నేపథ్యంలో వ్యాపార లావాదేవీల విషయంలో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో అతడిపై కోపం పెంచుకున్న సుభాని బుధవారం దుకాణంలో ఉన్న జాకీర్‌ హుస్సేన్‌పై ఇనుప రాడ్డుతో దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని మమత ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top