ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, సూర్యపేట : జిల్లాలో ఈ రోజు తెల్లవారు జామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బస్సును కారు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మునగాల మండలం బరాఖత్ గూడెం ఎన్హెచ్65 వద్ద ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి అన్నవరం వెళ్తున్న కారు అదుపుతప్పి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.