విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు

Two People Died In Fire Exchange At Visakha Manyam - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖ మన్యంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. జీకే వీధి, కొయ్యూరు మండలాల సరిహద్దులో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. అక్కడి అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు, మావోలకు మధ్య కాల్పులు జరిగనట్టుగా సమాచారం. అయితే ఈ కాల్పులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతిచెందిన వారిని గిరిజనులుగా అనుమానిస్తున్నారు. . కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top