నీటి సంపులో పడి చిన్నారి మృతి..!

Toddler Dies After Drown In Water Sump In Siddipet District - Sakshi

సాక్షి, సిద్దిపేట : ప్రమాదవశాత్తూ నీటిలో సంపులో పడిన ఓ చిన్నారి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన జిల్లాలోని జగదేవ్‌పూర్‌ మేజర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని నబీనగర్‌లో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. చిగుళ్ల దామోదర్‌ కుమారుడు కార్తీక్‌ (2) ఇంటి సమీపంలో ఉన్న నీటి సంపులో పడి మృతి చెందాడు. ముక్కుపచ్చలారని చిన్నారి మరణంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top