రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
నంగునూరు(సిద్దిపేట): కారు చెట్టును ఢీ కొన్న సంఘటనలో ముగ్గురు యవకులకు గాయాలైన సంఘటన బుధవారం నర్మేటలో జరిగింది. అప్పలాయిచెర్వుకు చెందిన నాయిని సంజీవరెడ్డి, నర్మేటకు చెందిన వడ్లకొండ రాకేష్, నార్లపురం చందుతో కలసి కారులో ప్రయాణిస్తున్నారు. నర్మేట శివారులోకి రాగానే కారు అదుపుతప్పి చెట్టుకు ఢీ కొట్టడంతో చందుకు త్రీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లాడు.
108 అంబులెన్స్లో రాకేశ్కు తీవ్ర గాయాలు కావడంతో హైద్రాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. డ్రైవర్ శశిధర్రెడ్డి, రాకేష్, సంజీవరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. రాజగోపాల్పేట ఎస్ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.