ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

The Student Died while Swimming  Warangal - Sakshi

సాక్షి, మహాముత్తారం(మంథని): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన ఆత్కూరి వినయ్‌(14) ఈతకు వెళ్లి నీటిలో మునిగి మృతిచెందిన సంఘటన శనివారం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... మోడల్‌ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న వినయ్‌ శనివారం సెలవు దినం కావడంతో స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. అందులో పంటలకు నీరు పెట్టేందుకు కొందరు గోతులు తవ్వగా ఈత కొట్టే క్రమంలో లోతుగా ఉండటంతో పడిపోయాడు. గమనించిన తోటి స్నేహితులు గ్రామంలోకి వచ్చి కుటుంబసభ్యులకు తెలిపారు. హుటాహుటిన గ్రామస్తులు, కుటుంబసభ్యులు వెళ్లగా అప్పటికే వినయ్‌ మృతిచెందాడు. తండ్రి సమ్మయ్య ఫిర్యాదు మేరకు మహాముత్తారం ఎస్సై రాము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపార 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top