రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

Student Died In Road Accident - Sakshi

అవుకు: గుంటూరులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల కేంద్రానికి చెందిన ఓ విద్యార్థి దుర్మరణం చెందా డు. మృతుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. పట్టణానికి చెందిన విశ్వనాథరావు, శైలజ దంపతుల కు ఇద్దరు కుమారులున్నారు.  చిన్న కుమారుడు మహేష్‌(21) గుంటూరులోని విజ్ఞాన్‌ లారా ఇంజినీరింగ్‌ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. పుట్టిన రోజు కావడంతో కొత్త దుస్తులు కొనుగోలు చేసేందుకు మిత్రుడు కారీక్‌తో కలిసి బైక్‌పై విజయవాడకు బయలుదేరారు. పెద్దకాకాని వద్ద నిలబడిన బొలెరో వాహనాన్ని బైక్‌ ఢీకొంది. ఘటనలో బైక్‌పై వెనుక కూర్చున్న మహేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. కార్తీక్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. గమనించిన స్థానికులు అతడిని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స నుంచి కోలుకోలేక మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top