విద్యుత్ షాక్తో విద్యార్థి మృతి
జయపురం: జయపురంలోని ప్రసాదరావుపేటలో 15ఏళ్ల బాబుల్ సాహు విదుదాఘాతానికి గురై మరణించాడు. బాబుల్ సాహు ప్రసాదరావుపేట రెండవలైన్లో నివసిస్తున్న రుతుపూర్ణ సాహు పెద్ద కుమారుడు. బాబుల్ సాహు ఇంటిలో ఒక విద్యుత్ తీగను పట్టుకోగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేనట్లు తెలుస్తోంది. బాబుల్ సాహు ఇటీవల జరిగిన 10 వ తరగతి పరీక్షలు రాశాడు. విద్యుదాఘాతానికి గురైన బాబుల్ సాహును వీధిలో వారు చూసి వెంటనే జయపురం ప్రభుత్వఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలియజేశారు.
ఇంటి పెద్ద కుమారుడు మరణించడంతో ఆ కుటంబంలో విషాదం నెలకొంది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.