విద్యార్థిని ఆత్మహత్య

 Student  Committed Suicide - Sakshi

శాయంపేట(భూపాలపల్లి): పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని హుస్సేన్‌పల్లిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... హుస్సేన్‌పల్లికి చెందిన నూనేటి రవీందర్, రజితలకు ఇద్దరు కుమార్తెలు స్రవంతి(19), శ్రావణి, కుమారుడు రాజ్‌కుమార్‌లు ఉన్నారు. స్రవంతి, శ్రావణిలు హన్మకొండలోని వేర్వేరు ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు.

రవీందర్‌ దంపతులు వ్యవసాయ పనులకు వెళ్లగా అక్కాచెల్లెళ్లు  కళాశాలకు వెళ్లారు.స్రవంతి పత్తిపాక గ్రామంలో బస్సు దిగి నడుచుకుంటూ హుస్సేన్‌పల్లికి బయలుదేరింది. ఊరు దాటగానే  ముళ్లపోదల్లో పడి మృతిచెందింది. స్థానికులు గమనించి మృతదేహాన్ని రవీందర్‌ ఇంటికి తీసుకెళ్లారు. కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు అక్కడున్నవారిని కంటతడి పెట్టించాయి.

అయితే స్రవంతి ఇంటి నుంచే ఆయిల్‌ డబ్బాలో పురుగుల మందు కళాశాలకు తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానిక ఎస్సై రాజబాబును వివరణ కోరగా ఇప్పటి వరకు మృతురాలి బంధువుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top